వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విపక్షాల్లో అయోమయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జైలులోని బాత్‌రూమ్‌ కిటికీకి ఉరి వేసుకుని అతను మరణించినట్లు అధికారులుఅంటున్నారు. అయితే ఈ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరణించిన బేగరి హనుమయ్య (30) మెదక్‌ జిల్లా కోహెడా గ్రామానికి చెందినవాడు. వేరొక యువతితో సంబంధంపెట్టుకుని భార్యను హతమార్చిన నేరానికి ఇటీవలే మెదక్‌ జిల్లా సంగారెడ్డిసెషన్స్‌ జడ్జి అతనికి జీవిత ఖైదు విధించారు. జనవరి 14వ తేదీ నుంచి రెండు రోజులు అతడ్ని సంగారెడ్డి సబ్‌ జైలులో వుంచి చర్లపల్లికి తెచ్చారు. జైలు ఆవరణలోని మైదానాలను శుభ్రపరిచే పనిని అతనికిఅప్పగించారు.

సోమవారం అందరితో పాటు బయటకు వచ్చి మామూలు పనులన్నీ పూర్తి చేసుకున్నాడు. మధ్యాహ్నం ఖైదీలందరితో కలిసి భోజనం చేశాడు. రెండు గంటల తర్వాత ఖైదీలు పనులకు వెళ్తూ పనికి వెళ్లటం లేదా అని అడిగితే ఒంట్లో బాగా లేదని చెప్పి ఆగమయ్య బ్యారక్‌కు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య ఆగమయ్య తన నడుముకున్న తాడుతో బ్యారక్‌ సమీపంలోని బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయాడని అధికారులు చెప్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X