వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ లక్ష్మీ సెహగల్‌ః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చర్చలకు పాకిస్థాన్‌ చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని, సమస్యలపై పునరాలోచన చేయడం లేదని భారత్‌విమర్శించింది. భారత్‌పై పాత పాటే పాడుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నిరుపమా రావు శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.

ఈ ప్రాంతంలో శాంతి కోసం పాకిస్థాన్‌సరైన విజన్‌ను రూపొందించి, ముందుకు తేవడాన్ని పాకిస్థాన్‌ వ్యతిరేకిస్తోందని ఆమె అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన వివిధఅంగాలు ఒకే విధంగా విసుగు కలిగించే శుష్క ప్రకటనలు చేస్తున్నాయని ఆమె అన్నారు. సంప్రదింపుల ద్వారా, పరస్పర సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కారానికి, చర్చలకు పాకిస్థాన్‌ నుంచి సానుకూల వైఖరి వ్యక్తం కావడం లేదని ఆమె అన్నారు.

పాకిస్థాన్‌ నుంచి చొరబాట్లు తగ్గాయని, అయితేసైనిక మోహరింపుల ఉపసంహరణ గురించి నిర్ణయం తీసుకోవడం తొందరపాటే అవుతుందని, చొరబాట్లను ఆపేయాలని తాము చేస్తున్న డిమాండ్‌, సీమాంతర ఉగ్రవాదానికి అంతం పలుకడం, ఉగ్రవాదాల మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టడం వంటివిషయాల్లో పాకిస్థాన్‌ చేయాల్సింది ఇంకా చాలా వున్నదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X