వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు వేధింపులకు యువకుడి ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: పోలీసుల వేధింపులకు భయపడి మహబూబ్‌నగర్‌కు జిల్లా మాడ్గుల మండలం నల్లోరిపల్లికి చెందిన ఇటికాల కొండల్‌ రెడ్డి (35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనం అభియోగానికిగురై, పోలీసు చేతిలో చావు దెబ్బలు తిని అవమానంగా భావించి, నేరవిచారణలో తిరిగి వారి చేతిలో చిత్రహింసలు అనుభవించాల్సి వస్తుందనే భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇందుకు ఆగ్రహం చెందిన ప్రజలు మాడ్గుల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కల్వకుర్తిలోని హైదరాబాద్‌ చౌరస్తాలో శవంతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాస్తారోకో నిర్వహించారు. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటామని నచ్చజెప్పి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించాలని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌సీతారాం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృతుడి బంధువులు, ప్రజలు పలు మార్లు పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు శవాన్ని రోడ్డుపైనే ఉంచి ఆందోళన చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X