వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బకాయిల వసూలుకు బిల్లు

By Staff
|
Google Oneindia TeluguNews

గౌహతిఃఅస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులకు పోలీసులకు జరిగిన ఘర్షణల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. గౌహతికి 450 కిలోమీటర్ల దూరంలోని అచంబన్‌ టీ తోటల వద్ద ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన ఘర్షణలో ఒక సైనికుడు, ఇద్దరుమిలిటెంట్లు దుర్మరణం పాలయినట్లు సైనికాధికారులువివరించారు.ఈ సందర్భంగా తీవ్రవాదుల నుంచి అత్యంతఅధునాతన ఆయుధాలుస్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమఅస్సాం లోని నల్బారీ జిల్లాలో జరిగిన ఘర్షణలో మరో ఇద్దరు ఉల్ఫా తీవ్రవాదులు, మరో సైనికుడు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. కొక్రాజర్‌ జిల్లాలో బోడోలాండ్‌ కు చెందినమిలిటెంట్లు ముగ్గురు పౌరులను కాల్చి చంపారు.అస్సాంపై ఆధిపత్యం కోసం పోరాడుతున్న ఉల్ఫా, బోడోలాండ్‌ లు చాలాకాలంగా ఇలా గెరిల్లా దాడులకు పాల్పడుతునే వున్నాయి. అయితే ఈ రెండు తీవ్రవాద సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు క్రమంగా ముందుకు వస్తున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X