ఎమ్మెస్సార్ నోటికి తాళం
హైదరాబాద్:
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ(పిసిసి)
అధ్యక్షుడు
ఎం.
సత్యనారాయణ
రావుకు
గడ్డు
కాలం
వచ్చినట్లే.
ఇందిరగాంధీకి
వ్యతిరేకంగా
మాట్లాడినఎం.
సత్యనారాయణ
రావును
తొలగించాల్సిందేనని
ఆయన
వ్యతిరేకులు
ఎఐసిసి
కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్
పార్టీ
వ్యవహారాల
ఇన్చార్జీమిర్షాద్
బేగ్ను
పట్టుబట్టారు.
మీడియాతో
మాట్లాడవద్దని
అధిష్ఠానం
సత్యనారాయణ
రావును
ఆదేశించింది.
ఈవిషయాన్ని
ఆయన
మీడియా
వద్ద
వ్యక్తం
చేశారు.
ఆయన
చేత
మాట్లాడించడానికి
వెళ్లిన
మీడియా
ప్రతినిధులకు
తాను
మాట్లాడబోనని,
అధిష్ఠానం
మీడియాతో
మాట్లాడవద్దని
చెప్పిందని
ఆయన
అన్నారు.
తాను మెదక్ ఉప ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికివచ్చానని మిర్షాద్ బేగ్ చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఆయన విలేకరులసమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. సత్యనారాయణరావును మార్చాలా, వద్దా అనే విషయంపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.సత్యనారాయణ రావు లేకుండా మిర్షాద్ బేగ్ విలేకరులసమావేశంలో పాల్గొనడం వివాదంగా మారింది.
ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ రావుపై పార్టీ కార్యకర్తలు పలువురు ఎఐసిసికార్యదర్శి మిర్షాద్ బేగ్కు ఫిర్యాదు చేశారు. సోమవారంమిర్షాద్ బేగ్ హైదరాబాద్లోని పిసిసికార్యాలయం గాంధీ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలుఎమ్మెస్సార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎమ్మెస్సార్నువెంటనే పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సత్యనారాయణరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.
పార్టీలో
ఇటువంటి
చిన్న
చిన్న
సంఘటనలు
జరుగుతూనే
వుంటాయని,
వారి
మాటలు
కూడావినాల్సిన
అవసరం
ఉన్నదని,
ఏమైనా
నిర్ణయం
తీసుకోవాల్సింది
ఎఐసిసి
అధ్యక్షురాలు
సోనియా
గాంధీయేననిమిర్షాద్
బేగ్
విలేకరులతో
అన్నారు.
తనపై
వచ్చిన
ఆరోపణలపై
మాట్లాడడానికి
సత్యనారాయణ
రావు
నిరాకరించారు.