వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉపరాష్ట్రపతిపై కాంగ్రెస్ పట్టు
విశాఖపట్నంః ఉపరాష్ట్రపతి పై ఎన్డీఏ ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీఅందుకు మద్దతు తెలుపుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి తెలిపారు. సోమవారంవిశాఖపట్నంలో జరిగిన ఎన్.ఎస్.యు.ఐ. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన జైపాల్ రెడ్డివిలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందని, ఉపరాష్ట్రపతివిషయంలో అలా కాకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీని సంప్రదించకుండా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేస్తే పోటీపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడబోదని ఆయన తేల్చి చెప్పారు.
Story first published: Monday, June 24, 2002, 23:53 [IST]