వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ప్రభుత్వంపై బిజెపి పోరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయించింది. ఈవిషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి జి. కిషన్‌ రెడ్డి బుధవారంవిలేకరులకు చెప్పారు. రాష్ట్ర పదాధికారుల, పార్లమెంటు నియోజక వర్గాల కన్వీనర్ల సమావేశంవివరాలను ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

సహకారం చక్కెర కర్మాగారాల ప్రయివేటీకరణ వెనుక అవినీతి ఉన్నదనేది తమ అభిప్రాయమని ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులను సమర్థిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ఆయన చెప్పారు. నక్సల్స్‌తో ప్రభుత్వ చర్చల ప్రక్రియను ఆయన సమర్థించారు. చర్చలు సజావుగా సాగడానికి హింసనుఅరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని, పోలీసులనుకోరారు. దున్నేగలిగేవానికే భూమి అనే నినాదంపై కూడా సమావేశం చర్చిస్తుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X