వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానితో శంకరాచార్య భేటి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్యజయేంద్రసరస్వతిబుధవారం ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయిని కలిశారు. ఆయన ప్రధానితో పదిహేను నిమిషాల పాటు మాట్లాడారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణంపైవిశ్వహిందూ పరిషత్‌ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల తలెత్తిన పరిస్థితి గురించి ఆయన ప్రధానితో మాట్లాడినట్లు సమాచారం. గత మూడు రోజులుగా శంకరాచార్య ఢిల్లీలో ఉన్నారు. ఆయనను పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు కలుసుకున్నారు.వీరి విజ్ఞప్తుల గురించి కూడా శంకరాచార్య ప్రధానికి చెప్పినట్లు సమాచారం. అయోధ్యవివాదంలో కోర్టు తీర్పునకు కట్టుబడి వుంటామని తాము ప్రధానికి ఇచ్చిన హామీ పత్రాన్ని వాపసు తీసుకోవాలని విహెచ్‌పి నేతఅశోక్‌ సింఘాల్‌ శంకరాచార్యను కోరిన విషయం తెలిసిందే.వివాదంలో లేని భూమిని రామాలయ నిర్మాణం కోసం ఇవ్వాలని శంకరాచార్య ప్రభుత్వాన్ని ఇది వరకేకోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X