వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంబానీలను పరామర్శించినచంద్రబాబు
ముంబయ్ః ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీరూబాయ్అంబానీ కుటుంబసభ్యులను పరామర్శించారు. గురువారం ఉదయం ఆయన బ్రీచ్ కాండి ఆస్పత్రికి వెళ్ళారు.అంబానీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వున్న అనిల్అంబానీతో చంద్రబాబు కొద్ది సేపు మాట్లాడారు. ధీరూబాయ్అంబానీ మూడు రోజులుగా కోమాలో వున్న విషయంవిదితమే. పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులతో పాటుఅమితాబ్ బచ్చన్ తో సహా చలనచిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికేఅంబానీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Comments
Story first published: Thursday, June 27, 2002, 23:53 [IST]