వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ రెచ్చిపోతే ఊరుకోంఃబాబు
హైదరాబాద్ః లార్డ్ మైదానంలో భారత యువకిశోరాలు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైనవిజయాన్ని సాధించిన క్షణంలో భాగ్యనగరం ఉప్పొంగిపోయింది. టపాకాయలపేలుళ్ళతో భాగ్యనగరం దీపావళిని తలపించింది. అర్థరాత్రి పూట యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి, కేరింతలు కొడుతూ పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. బార్లలో బీర్లు పొంగి పొర్లాయి. యువకులు చివరకు వృద్ధులు కూడా కేరింతలు కొడుతూ వీధుల్లో నాట్యం చేశారు. ఎవరి నోటవిన్నా యువరాజ్, కైఫ్ కబుర్లే... భారత క్రికెట్ కు పట్టిన శని ఇప్పటికైనా వీడిందనే ఆశాభావంతో కూడిన మాటలే.
Comments
Story first published: Wednesday, July 3, 2002, 23:53 [IST]