వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాదులపై చిత్తశుద్ధిలేని సర్కార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃపీపుల్స్‌ వార్‌ తో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు సఫలం కావాలన్నదే తమ అభిమతమని అయితే నక్సలైట్లు కేవలం కాలయాపన చేస్తున్నారని డిజిపి పేర్వారం రాములు అన్నారు. మూడు విడతల చర్చల్లో నక్సలైట్లు సాధించిందేమిటని ఆయన ప్రశ్నించారు. చర్చల్లో ఏ మాత్రంపురోగతి లేదని వారి వైఖరిని జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్లు కావాలని కాలయాపన చేస్తున్నారని గురువారం జరిగినవిలేకర్ల సమావేశంలో ఆయన విమర్శించారు.

నక్సలైట్ల ఉద్యమం చల్లారనే మేమూ కోరుకుంటున్నాం అయితే చర్చల పట్ల వార్‌ కు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. చర్చలు సఫలం కావాలని వారు నిజంగా కోరుకుంటే డబ్బు దాటుకుంటున్నట్లే ఆయుధాలు కూడా దాచిపెట్టి చర్చలువిఫలం అయితే మళ్ళీ వాటిని తీసుకోవచ్చుకదా అని సలహా ఇచ్చారు.

చర్చల భగ్నానికి కుట్రః
పీపుల్స్‌ వార్‌ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరుగుతున్న చర్చను భగ్నం చేసేందుకే ఎన్‌ కౌంటర్లు చేస్తున్నారని పౌరసంఘాలువిమర్శించాయి. బొజ్జా తారకం సారధ్యంలోని పీస్‌ ఇనిషియేటివ్‌ కమిటీ గురువారం ప్రెస్‌ క్లబ్‌ లోవిలేకర్ల సమావేశం నిర్వహించింది. చర్చలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కూడా బొజ్జా తారకం డిమాండ్‌ చేశారు.

చర్చల కొనసాగింపుపై తమ్మనేని ఆశాభావంః
ఎన్‌ కౌంటర్ల నేపధ్యంలో వార్‌ తో జరుగుతున్న చర్చలకు విఘాతం కలగబోదని ప్రభుత్వప్రతినిధి, రాష్ట్ర మంత్రి తమ్మినేని సీతారం అభిప్రాయ పడ్డారు. ఈ నెల 20నపీపుల్స్‌ వార్‌ ప్రతినిధులు చర్చలకు వస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X