వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోఫోర్స్‌కేసులో హిందూజాలకు సుప్రీంషాక్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః బోఫోర్సు కేసులో హిందూజాలపై దాఖలు చేసిన ఛార్జిషీటును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 64 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు హిందూజా సోదరులను ఈ కేసు నుంచివిముక్తుల్ని చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పగా ఆ తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సిబిఐ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టుల హైకోర్టు తీర్పు చెల్లదని స్పష్టం చేసింది.

జస్టిస్‌ కిర్పాల్‌, జస్టిస్‌ బాలకృష్ణన్‌, జస్టిస్‌ ఆర్జిత్‌ లు సిబిఐ పిటిషన్‌ ను పరిశీలించి ఈ తీర్పు చెప్పారు. బోఫోర్సుకేసుపై విచారణ యధావిధిగా కొనసాగుతుందని కూడా న్యాయమూర్తులు తీర్పు వెల్లడించారు. ఈ కేసు నుంచివిముక్తి పొందామంటూ హిందూజా సోదరులు పడిన సంబంరం మూన్నాళ్ళ ముచ్చటగానేమిగిలిపోయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X