వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతియుతంగా గుజరాత్‌ యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః అసాధారణ భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారం నాడు అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నరేంద్రమోడి పాల్గొన్న ఈ కార్యక్రమం కోసం అసాధార రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలోని జమాల్‌పూర్‌ గేటు ప్రాంతంలో జగన్నాథ ఆలయం నుంచి రథ యాత్ర ప్రారంభమైంది.

యాత్ర ముందు భాగాన డజను ఏనుగులు నడిచాయి. వేలసంఖ్యలో భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర దేవతా మూర్తులవిగ్రహాలు వున్న రథాన్ని భక్తులు లాగారు. అయిదువేల మంది పోలీసులు, 80 కంపెనీలస్టేట్‌ రిజర్వ్‌ పోలీసులు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం సిబ్బందిని దారిపొడవునా మొహరించారు. కొన్ని చోట్ల పోలీసులు పేలుడు పదార్ధాలనుస్వాధీనం చేసుకున్నారు. అసలే మతకల్లోలాతో మారణహోమాన్ని చవిచూసిన గుజరాత్‌లో ఈ రథయాత్ర మరోసారిఅగ్గి రాజేసే అవకాశం వున్నదంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో అధికార యంత్రాంగం తీవ్రమైనటెన్షన్‌తో గడిపింది. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X