వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజనిర్ధాణకు దేశం సవాల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తుంగతుర్తిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కి చెందిన గడిలో జరిగిన పేలుడు సంఘటనపై నిజనిర్ధాణకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసింది. దామోదర్‌రెడ్డి ఇంట్లో జరిగిన సంఘటనను తెలుగుదేశంపైకి నెట్టివేసేందుకు పిసిసి నేత సత్యనారాయణరావు ప్రయత్నిస్తున్నారంటూ తెలుగుదేశం ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

ఈ సంఘటనలో తనకు ప్రమేయం వున్నదంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించడాన్ని దేశం నేత సంకినేని సత్యనారాయణ ఖండించారు. తనను హతమార్చేందుకే దామోదర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయనకు నేరచరిత్ర వున్నదని సంకినేని ఆరోపించారు. ఈ సంఘటనపై తెలుగుదేశం నాయకుడు గుత్తాసుఖేందర్‌ రెడ్డి సారథ్యంలో ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ సంఘాన్ని తాము నియమిస్తామని కాంగ్రెస్‌ కూడా జైపాల్‌రెడ్డి సారథ్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించి బహిరంగావిచారణ జరిపాలని దేశం నేతలు సవాలు విసిరారు. అప్పుడేఅసలు నిజాలు బయటకు వస్తాయని వారు అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X