వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాకు హోం మంత్రి అన్యాయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తెలంగాణాకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రకటనలు గుప్పించే హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌లో తెలంగాణా యువతకు దారుణమైన అన్యాయం జరిగినప్పటికీ నోరెత్తలేదని టిఆర్‌ఎస్‌ నేత చంద్రశేఖర్‌రావు ఆరోపించారు.

తెలంగాణా యువకులకు జరిగిన అన్యాయానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన నివాసంలో శుక్రవారం నాడు పార్టీ నేతలు రత్నం, మధుసూదనాచారి, వరలక్ష్మి, యాదగిరిరెడ్డితో కలసివిలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జంటనగరాల్లో ఎస్‌ఐ, సిఐ స్థాయి ఉద్యోగులు 410 మంది వుండగా వారిలో కేవలం 110 మంది మాత్రమే తెలంగాణావారని 300 మంది స్థానికేతరులని ఆయన వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఆరు జోన్‌లే వున్నా ప్రభుత్వం కొత్తగా ఫ్రీ జోన్‌పేరిట హైదరాబాద్‌ జోన్‌ను సృష్టించిందని ఆయనపేర్కొన్నారు. హైదరాబాద్‌ జోన్‌లో ఆరో జోన్‌ అధికారులను నియమించాల్సింది హైకోర్టు తీర్పు నిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయనవిమర్శించారు. హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌, డిజిపిపేర్వారం రాములు, హోం శాఖ ప్రధాన కార్యదర్శి భరత్‌చంద్ర తెలంగాణా వారేఅయినప్పటికీ తెలంగాణా అభ్యర్ధులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దలేకపోతున్నారని ఆయనవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X