వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుపై చంద్రబాబు ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఈ ఏడాది తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొనే ప్రమాదం వున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాలలో చర్చించాల్సినవిషయాలను ఖరారు చేసేందుకు చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం నేతలతో ఒక సమావేశం జరిగింది. ఎన్టీఆర్‌ భవన్‌ లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.పి.లు, ఎమ్మెల్ల్యేలుపాల్గొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన పార్టీ వ్యూహాన్ని ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయాభివృద్ధికి వేసుకున్న పథకాలన్నీ వృధా అయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. గతం ఏడాది కూడా పాక్షికంగా కరవు పరిస్థితి నెలకొన్నదని, ఈ ఏడాది ఇంతవరకు వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలను ఫలవంతంగా నిర్వహించేందుకు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలనేవిషయంపై ఆయన చర్చించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X