వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ లో నరమేధం- 27మంది హతం
జమ్ముః తీవ్రవాదులు కాశ్మీర్ లో మరోసారి నరమేధం సృష్టించారు. శనివారం రాత్రి జమ్ములోని కార్మికులు నివసించే కాలనీలో సాధువుల వేషంలో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. కనీసం 30 మందికి పైగా గాయపడ్డారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో తీవ్రవాదులు మెరుపుదాడి చేసి అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటనతో కాశ్మీర్ కలవర పడిపోయింది.
Comments
Story first published: Sunday, July 14, 2002, 23:53 [IST]