వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ లో నరమేధం- 27మంది హతం

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్ముః తీవ్రవాదులు కాశ్మీర్‌ లో మరోసారి నరమేధం సృష్టించారు. శనివారం రాత్రి జమ్ములోని కార్మికులు నివసించే కాలనీలో సాధువుల వేషంలో ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. కనీసం 30 మందికి పైగా గాయపడ్డారు. విద్యుత్‌ సరఫరా లేని సమయంలో తీవ్రవాదులు మెరుపుదాడి చేసి అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటనతో కాశ్మీర్‌ కలవర పడిపోయింది.

లష్కర్‌ ఏ తోయిబా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రాధమిక సమాచారం బట్టి తెలుస్తున్నది. ఈ సంఘటన పట్ల ప్రధాని వాజ్‌పేయి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపప్రధానిఅద్వానీ సంఘటన జరిగిన ప్రాంతంలోపర్యటించారు. కొద్దిరోజులుగా ప్రశాంతంగా వున్న కాశ్మీర్‌ లో ఒక్కసారిగా నెత్తుటేరులు పారడంతో దేశం దిగ్భ్రాంతికి లోనయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X