వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, వైయస్‌ల మధ్య వాగ్వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో పనికి ఆహార పథకం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డికి మధ్య స్వల్ప వాగ్వివాదం చెలరేగింది. తుంగభద్ర జలాలను కర్ణాటక అక్రమంగా వినియోగించుకుంటున్న అంశంపై మంగళవారం శాసనసభలో చర్చ జరుగుతుండగా పనికి ఆహార పథకం అమలు విషయం ప్రస్తావనకు వచ్చింది.

రాష్ట్రానికి పనికి ఆహార పథకం కింద కేంద్రం బియ్యం ఇచ్చేవిషయంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నారా, ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారా ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు.

దీనికి రాజశేఖర్‌ రెడ్డి ప్రతిస్పందిస్తూ- కేంద్రం నుంచి తాము బియ్యం తేవడానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ బియ్యం దోపిడీ దొంగలకు పోతోందని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు వాటిని దోచుకుంటున్నారని, ఆ దోపిడీతో నిన్న మోటారుసైకిళ్లపై తిరిగిన తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు క్వాలిస్‌లలో,పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి వచ్చే సహాయానికి కూడా కాంగ్రెస నాయకులు అడ్డు తగులుతున్నారని, ఈవిషయంలో నిర్ణయాన్ని కాంగ్రెస్‌కే వదిలేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. బియ్యం ఇవ్వకూడదని ఢిల్లీకి లేఖలు రాస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X