వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు ఎక్స్‌గ్రేషియాకు తిరస్కారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రైతుల ఆత్మహత్యకు పాల్పడితే ఎక్స్‌గ్రేషియా చెల్లించేది లేదనిప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. మంగళవారం శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యుడు వరదరాజులు రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.

తన నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతు దంపతులకు లక్షరూపాయల చొప్పునఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరగా ప్రభుత్వం నిరాకరించింది. పోటీ పరీక్షల వయోపరిమితిని 28 ఏళ్లకు తగ్గించడం పట్ల సిపిఎం నాయకుడు నోముల నర్సింహయ్య తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తీవ్రనిరాశా నిస్పృహలకు గురయ్యారని ఆయనపేర్కొన్నారు. రాష్ట్రం కరవు కోరల్లోచిక్కుకుని విలవిల్లాడుతుంటే అధికారులు మాత్రం రైతుల నుంచి బకాయిల వసూలుకు వేధింపుచర్యలకు దిగుతున్నారని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం వున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల బకాయిలు,విద్యుత్‌ బిల్లుల వసూలును నిలిపివేయాలని ఆయనకోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X