వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరను అంటే ఆత్మహత్య: ఎమ్మెస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తాను ఇందిరా గాంధీనివిమర్శించాల్సిన పరిస్థితి వస్తే ఆత్మహత్యకు సైతం సిద్ధపడుతానని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు. ఇందిరా గాంధీ తనకు తల్లితో సమానమని, ఆమెవిమర్శించే స్థాయికి తాను ఎదగలేదని ఆయన అన్నారు.

ఇందిరా గాంధీనివిమర్శించినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన సోమవారం కాంగ్రెస శాసనభ్యుల సమక్షంలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ఆయన కాంగ్రెస్‌ లెజిస్లేచ్‌ పార్టీ సమావేశంలో ప్రసంగించారు. ఈవిషయంలో మిమ్మల్ని తామెవరమూ అడగలేదని, తప్పు పట్టలేదని, దీనిపై ఇక్కడ మాట్లాడి కొత్తగావివాదం రేపడం ఎందుకని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నప్పటికీ సత్యనారాయణ రావువినలేదు. మీకు వివరణ ఇవ్వటం నా బాధ్యత. నాపై ఎవరు వార్తలు రాయిస్తున్నారో నాకు తెలుసు. దానిపై ఇప్పుడు మాట్లాడను. నా బాధ చెప్పుకుంటున్నానంతే అని ఆయన అన్నారు. ఇందిరాగాంధీనివిమర్శించానన్న నిందను మోయలేకపోయానని, ఆ నింద కారణంగా తనకు నిద్ర కూడా పట్టలేదని ఆయన అన్నారు.

ఈ నెల 20వ తేదీన సిడబ్ల్యుసి సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జీ వాయలార్‌ రవి రాష్ట్రానికి వస్తున్నారని ఆయన చెప్పారు.పిసిసి, సిఎల్‌పి చక్కని సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మెదక్‌అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ శాసనసభ్యులు బాగానే కృషి చేశారని, ఇంకా కొంచెం కష్టపడి ఉంటే గెలిచి వుండేవారమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X