వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊచకోతపై వీగిన తీర్మానం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం మూజువాణిఓటుతో సభ తిరస్కరించింది. ఈ తీర్మానంపై సభలో జరిగిన చర్చ సందర్భంగా టెర్రరిజాన్ని అణిచివేసే విషయంలో ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధానమంటూ లేదని విపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి.

పాకిస్తాన్‌ను విమర్శించినంత మాత్రాన టెర్రరిజాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని వారుపేర్కొన్నారు. తీర్మానం పై చర్చలో పాల్గొన్న ప్రతిపక్షాలు ప్రభుత్వం టెర్రరిజం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా పాకిస్తాన్‌ బూచిని చూపిస్తున్నదని దుయ్యబట్టారు. చర్చను కాంగ్రెస్‌ సభ్యుడు శివరాజ్‌పాటిల్‌ ప్రారంభించారు. చర్చకు సమాధానిమిస్తూ అద్వానీ ప్రతిపక్షాల వైఖరిని ఆక్షేపించడంతో పాటు పాకిస్తాన్‌ను టెర్రరిస్టు రాజ్యంగా ప్రకటించాలని పశ్చమరాజ్యాలనుకోరారు. పాకిస్తాన్‌తో భారత్‌ ఒంటరిగానే పోరాడుతుందని ప్రకటించారు. చర్చల మధ్యలో జోక్యం చేసుకున్న రక్షణ మంత్రి జార్జ్‌, నెపంపాక్‌పైకి నెట్టి ప్రభుత్వం తప్పించుకుంటున్నదన్నవిమర్శలను ఖండించారు. తర్వాత ప్రతిపక్ష సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేయడంతో తీర్మానం మూజువాణి ఓటుతోవీగిపోయినట్టుగా స్పీకర్‌ ప్రకటించారు. దేశంలో యుద్ధ భయాన్ని సృష్టిస్తూ మతోన్మాద వాతావరణాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తున్నదని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ దుయ్యబట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X