వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌పై న్యాయపోరాటం

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడః విజయవాడ పోలీసు స్టేషన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై స్థానిక ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ఈ ఎన్‌కౌంటర్‌ కథనం నమ్మశక్యంగా లేదని విజయవాడ పౌరులు అంటున్నారు. ఈ సంఘటనపై తాము పోలీసులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయనున్నట్టుగా విజయవాడ బార్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

తెలుగుదేశంనాయకుడు ఈడ్పుగంటి సత్యనారాయణ హత్యకేసులోనిందితునిగా పోలీసులు అరెస్టు చేసిన బుడ్డాశంతన్‌ అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్‌లోనేకాల్చివేసిన విషయం విదితమే. నిందితుడుఇంటరాగేషన్‌ సమయంలో ఎస్‌ఐపై తిరగబడిరివాల్వర్‌ లాక్కోవడంతో ఎదురు కాల్పులు జరిపినట్టుగాపోలీసులు చెబుతున్నా ఈ కథనాన్ని ఎవరూ విశ్వసించడంలేదు. పోలీసు కమిషనర్‌ చట్టాన్ని పూర్తిగా తనచేతుల్లోకి తీసుకున్నాడని న్యాయవాదులుఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బార్‌ అసోసియేషన్‌మంగళవారం నాడు విధులను బహిష్కరించింది.దీనిపై కోర్టులో కేసు దాఖలు చేయనున్నట్టుగాబార్‌ అసోసియేషన్‌ నాయకులు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X