వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేర్వారం నియామకం కరెక్టే

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ డిజిపిగా పేర్వారం రాములు నియామకాన్ని సవాలు చేస్తూ సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన పిటీషన్‌ వీగిపోయింది. పేర్వారం నియామకాన్ని సమర్ధిస్తూ ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది.

రాష్ట్రంలోని ఐపిఎస్‌ అధికారులందరిలోకి తానుసీనియర్‌నని అత్యున్నత స్థాయి పోలీసు పదవికిసర్వీసు నియమాల ప్రకారం తననే పరిగణలోకి తీసుకోవాలని ఆంజనేయరెడ్డి పిటీషన్‌లోకోరారు. సీనియార్టీని పక్కనబెట్టి తనకంటే జూనియరైనపేర్వారం రాములను డిజిపిగా నియమించడాన్ని ఆయన సవాలు చేశారు. అయితే ఆంజనేయరెడ్డి కంటే రాములు పదవీ కాలం ఎక్కువగా వున్నందున ఆయన్ను ఈ పదవిలో నియమించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. పాలనా సౌలభ్యం దృష్ట్యా త్వరలోనే పదవీవిరమణ చేయనున్న ఆంజనేయరెడ్డిని ఎంపికచేయలేదని ఆయన తెలిపారు. ఉభయ వర్గాల వాదనవిన్న ట్రిబ్యునల్‌ ప్రభుత్వ వాదనను సమర్ధించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X