వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడ్డీ రాయితీకి రూ.83 కోట్లు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరవు పరిస్థితుల నెలకొన్న దృష్ట్యా రైతుల సహకార రుణాలపై ఐదు శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు, ఇందుకు గాను 83 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు.

రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై శుక్రవారం దాదాపు ఆరు గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ వడ్డీ రాయితీ కోసం మంజూరు చేసిన 83 కోట్ల రూపాయలలో 25 కోట్ల రూపాయలు విడుదల చేశామని,మిగతా మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. సహకార రుణాల చెల్లింపునకు కల్పించిన వన్‌ టైమ్‌సెటిల్‌మెంట్‌ సౌకర్యాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ వరకు పొడగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు ఈ సౌకర్యాన్ని ఈ కొందరు వాడుకున్నారని, కొందరు వాడుకోలేదని, ఇంతకు ముందు వాడుకోనివారి కోసం ఈ సౌకర్యాన్ని డిసెంబర్‌ వరకుపొడిగిస్తున్నామని ఆయన వివరించారు.విత్తనాలపై రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన సమాచారం కూడా ఇస్తున్నామని ఆయన అన్నారు. వన్‌ టైమ్‌సెటిల్‌మెంట్‌ కోసం రైతులు సెప్టెంబర్‌ లోగా దరఖాస్తులు తీసుకోవాల్సి వుంటుందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X