వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మిగనూరు ఎత్తిపోతలపై రభస
హైదరాబాద్ః కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎత్తిపోతల పధకంపై శుక్రవారం అసెంబ్లీలో పెనువివాదం చెలరేగింది. దళితుల కోసం ఉద్దేశించిన ఈ ఎత్తిపోతల పధకం ఈ రోజున అగ్రవర్ణాల పరం అయిందని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్ల్యే మారప్ప మాట్లాడుతూ రవాణా మంత్రి బి.వి. మోహన్ రెడ్డి బంధువులు ఈ ఎత్తిపోతల పథకాన్ని సొంతం చేసుకున్నారని దుయ్యబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెనువివాదం చెలరేగింది.
Story first published: Friday, July 26, 2002, 23:53 [IST]