వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై అలిగిన జయ

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నైః నూతన రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రమాణస్వీకారోత్సవానికి తనను ఆహ్వానించనందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె నాలుగుపేజీల ఘాటైన లేఖను కేంద్రానికి పంపించారు. తనలాంటి వారినిపిలవకుండాఅంబానీ సోదరులకు పిలిచి పీటలు వేయడం గోరుచుట్టుమీద రోకటిపోటుగా ఆమె అభివర్ణించారు. జయలలిత ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇటీవల కాలంలో ఇదే.అంబానీ సోదరులకున్న ప్రత్యేక అర్హతలేమిటని ఆమె ప్రశ్నించారు.

కొత్త రాష్ట్రపతి తమిళనాడుకు చెందిన వారైనందున తనను ఆహ్వానించకపోవడం తనకే కాక తమిళనాడు ప్రజలందరికీ అవమానకరమని ఆమె అన్నారు. రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి పేరును పనిగట్టుకుని తొలగించడం తమిళనాడు ప్రజలకు అమర్యాద అని, ఫెడరన్‌ స్ఫూర్తికి గొడ్డలిపెట్టని ఆమె అభివర్ణించారు. తనకు సాధారణ ఆహ్వానం మాత్రమే వచ్చినందునవెళ్ళలేదన్న వార్తలను ఆమె ఖండించారు.కేంద్రం నుంచి నాకు ఎటువంటి ఆహ్వానంఅందలేదు అని అన్నారు. కేంద్రప్రభుత్వ ధోరణిని ఆలోచనాపరులందరూ ఖండించాలనిఆమె కోరారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X