వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగ్యనగరిలో దురాక్రమణలపర్వం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రరాజధాని నగరం, చుట్టుపక్కల మున్సిపాల్టీలలో అక్రమ ఆక్రమణలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతున్నదనిఅసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా నాగోల్‌ లో 23 ఎకరాల భూమి దురాక్రమణకుగురైనా ప్రభుత్వం అందుకు బాధ్యులైన అధికారులపై ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రతిపక్షం నిలదీసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి తో పాటు పరిసరాల మున్సిపాల్టీల్లో కూడా ఆక్రమణలపర్వం యధేచ్ఛగా కొనసాగుతున్నదని కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై,విలువైన భూములను స్వాహా చేస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందుకు రెవెన్యూ మంత్రి అశోక గజపతి రాజు మాట్లాడుతూ నాగోల్‌ లో ఆక్రమణకుగురైన మూడెకరాల స్థలాన్ని కోర్టు ఆదేశాల ప్రకారంస్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే కోట్లాది రూపాయల ఈ భూమిని ముక్కలు చేసి అమాయకులైన ప్రజలకు అమ్మారని, ఇప్పుడు వారు తీవ్రంగా నష్టాలపాలౌతున్నారని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X