వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వతంత్ర పర్యవేక్షకులకు అనుమతి: పావెల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌ శాసనసభ ఎన్నికలను పర్యవేక్షించడానికిస్వతంత్ర అంతర్జాతీయ పర్యవేక్షకులకు అనుమతి ఇవ్వాలని అమెరికా భారత్‌ను కోరింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్‌ పావెల్‌ భారత్‌నుకోరారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియనుదెబ్బ తీయకూడదని ఆయన పాకిస్థాన్‌కు సూచించారు. భారత, పాకిస్థాన్‌ పర్యటన కోసం ఆయన శనివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా జరపేందుకు భారత్‌ కట్టుబడిఉండడాన్ని ఆయన హర్షించారు. ఎన్నికలను సమగ్రం చేయడానికిస్వతంత్ర పర్యవేక్షకుల అనుమతి, రాజకీయ ఖైదీల విడుదల ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో అన్నారు. తగినంత మంది పర్యవేక్షకులు ఉండడం వల్ల ఏం జరుగుతోందో తెలిసిపోతుందని, ఎన్నికల తీరు అర్థమవుతుందని, దాని వల్ల ఎన్నిలకు ప్రతిష్ట పెరుగుతుందని ఆయనవివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X