వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంధకారంలో ఆరు రాష్ట్రాలు
ముంబయ్ః మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పశ్చిమ గ్రిడ్విఫలమై ఆరు రాష్ట్రాల్లో అంధకారం నెలకొంది. బుధవారం ఉదయానికి గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలోవిద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. మహారాష్ట్ర, గోవాలలో ఇంకావిద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరించలేదు. మధ్యప్రదేశ్ కోటాకుమించి విద్యుత్ ను వాడుకోవడం వల్లే ఈ అనర్ధం జరిగిందని మహారాష్ట్ర సర్కార్ ఆరోపించింది. ఇందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల గ్రిడ్విఫలం అయితే అందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై నిందలు వేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు.
Comments
Story first published: Wednesday, July 31, 2002, 23:53 [IST]