వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంధకారంలో ఆరు రాష్ట్రాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పశ్చిమ గ్రిడ్‌విఫలమై ఆరు రాష్ట్రాల్లో అంధకారం నెలకొంది. బుధవారం ఉదయానికి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ లలోవిద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించగలిగారు. మహారాష్ట్ర, గోవాలలో ఇంకావిద్యుత్‌ సరఫరా పూర్తిగా పునరుద్ధరించలేదు. మధ్యప్రదేశ్‌ కోటాకుమించి విద్యుత్‌ ను వాడుకోవడం వల్లే ఈ అనర్ధం జరిగిందని మహారాష్ట్ర సర్కార్‌ ఆరోపించింది. ఇందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల గ్రిడ్‌విఫలం అయితే అందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంపై నిందలు వేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు.

రాజస్థాన్‌ లోని కొన్ని ప్రాంతాల్లో కూడావిద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం రాత్రి ఈ ఆరు రాష్ట్రాలకు కాళరాత్రిలా మారింది. బుధవారం ఉదయం నుంచి క్రమంగావిద్యుత్‌ ను పునరుద్ధరించే కార్యక్రమం ప్రారంభించారు. బుధవారం సాయంత్రాని కల్లా అన్ని రాష్ట్రాలలోవిద్యుత్‌ ను పునరుద్ధరించే అవకాశాలున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X