వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పిన వార్‌గురి: టీచర్‌పై కాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ నగరంలోపీపుల్స్‌వార్‌ లక్ష్యం గురి తప్పి ఒక అమాయక ఉపాధ్యాయుడు గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. చిట్యాల మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌ నాయక్‌ అని అనుమానించి బండి నగేష్‌ అనే ఉపాధ్యాయుడిపైపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కాల్పులు జరిపారు.

లక్ష్మణ్‌ నాయక్‌తో మాట్లాడి హన్మకొండలోని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తున్న నగేష్‌పై నక్సలైట్లు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నగేష్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. దీంతో ఆయనను వరంగల్‌లోని ఒక ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. తదనంతరం ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.

అమాయకుడైన టీచర్‌ ప్రాణం పోతే అందుకుపీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా నాయకుడు ఆర్‌కె బాధ్యత వహించాలని స్థానిక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్నారు. అమాయకుడిపై దాడి చేసిన ఈ సంఘటననుపీపుల్స్‌వార్‌, దానికి వత్తాసు పలుకుతున్న పౌరహక్కుల సంఘాలు ఏ విధంగా సమర్థించుకుంటాయని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X