వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరవుతో చస్తుంటే చదువుల పండగా?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రం యావత్తు కరవుతో అల్లాడుతుందని అంగీకరిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదువుల పండుగలు నిర్వహిస్తున్నారనిసిపిఎం ఎద్దేవా చేసింది. సిపిఎం శాసనసభాపక్ష నేత నోముల నర్సింహయ్య శుక్రవారం రంగారెడ్డి జిల్లా గ్రామాల్లో పర్యటించారు. రాష్ట్రంలో ఇంతటి కరవు పరిస్థితి నెలకొంటే అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్ల్యే కానీ, మంత్రులు కానీ ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదని ఆయన విమర్శించారు. ప్రజలపై అధికార పార్టీకి ఎంత శ్రద్ధ వున్నదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని ఆయన దుయ్యబట్టారు.

రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలను పర్యటించిన సిపిఎం బృందానికి గ్రామాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకున్నారు. పనికి ఆహారపథకంలో జరుగుతున్న అవకతవకలనువివరించారు. విద్యుత్‌ చార్జీల వసూళ్ళ పేరిట జులుం గురించి చెప్పారు. కూలికోసం పట్నాలకు వలసపోతున్నామని ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. పల్లెల్లో పరిస్థితి ఇలా వుంటే చంద్రబాబు నాయుడు చదువుల పండగలు చేయడం విడ్డూరం అని నర్సింహయ్యవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X