వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరవుతో చస్తుంటే చదువుల పండగా?
హైదరాబాద్ః రాష్ట్రం యావత్తు కరవుతో అల్లాడుతుందని అంగీకరిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదువుల పండుగలు నిర్వహిస్తున్నారనిసిపిఎం ఎద్దేవా చేసింది. సిపిఎం శాసనసభాపక్ష నేత నోముల నర్సింహయ్య శుక్రవారం రంగారెడ్డి జిల్లా గ్రామాల్లో పర్యటించారు. రాష్ట్రంలో ఇంతటి కరవు పరిస్థితి నెలకొంటే అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్ల్యే కానీ, మంత్రులు కానీ ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదని ఆయన విమర్శించారు. ప్రజలపై అధికార పార్టీకి ఎంత శ్రద్ధ వున్నదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని ఆయన దుయ్యబట్టారు.
Comments
Story first published: Friday, August 9, 2002, 23:53 [IST]