వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమి, ఇ-గవర్నెన్స్‌ కు ప్రశంస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న జన్మభూమి, ఇ-గవర్నెన్స్‌ పథకాలపై వివిధ రాష్ట్రాలకు చెందిన ఐ.ఎ.ఎస్‌. అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. పలు రాష్ట్రాలకు చెందిన ఐఎఎస్‌ అధికారులు భారతదర్శని పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌ సందర్శిచారు. ఈ బృందం రాష్ట్ర గవర్నర్‌ రంగరాజన్‌ ను కలుసుకుంది.

రాష్ట్రంలో చేపడుతున్న జన్మభూమి, ఇ-గవర్నెన్స్‌ పథకాల గురించి రంగరాజన్‌ వారికివివరించారు. విలక్షణ రీతిలో నిర్వహిస్తున్న ఈ రెండు పధకాలను ఐఎఎస్‌ లు ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఎఎస్‌ లు గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. గోవాలో ప్రారంభమైన ఈ భారతదర్శనం హైదరాబాద్‌ పర్యటనతో ముగిసిందని, వివిధ రాష్ట్రాలలోని అభివృద్ది పథకాలను అధ్యయనం చేయడమే తమ పర్యటన లక్ష్యం అని వారు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X