వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దలసభలో ఆరనిపెట్రోల్‌ మంటలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పెట్రోలియం స్కామ్‌పై రాజ్యసభలో శుక్రవారం నాడు కూడా పెద్దఎత్తున రభస జరిగింది. డిప్యూటి చైర్మన్‌ నజ్మా హెఫ్తుల్లా ఎంత ప్రయత్నించినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. తొలుత సభ ప్రారంభం కాగానే క్విట్‌ ఇండియా ఉద్యమం అరవయ్యవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పిస్తూ నజ్మా ఒక తీర్మానాన్ని చదివారు.

సభ్యులంతా తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత సభ రెండు నిమిషాలు మౌనం పాటించిస్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించింది. ఆ వెంటనే ప్రతిపక్షాలు యథా ప్రకారంపెట్రోలియం స్కామ్‌ను లేవనెత్తి ప్రధాని వాజ్‌పేయి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నజ్మా హెఫ్తుల్లా ఎంత ప్రయత్నించినప్పటికీ వారు శాంతించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X