వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యాసాగర్‌కు ఉద్వాసన ఖాయం?

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పెట్రోల్‌ బంకుల స్కామ్‌ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో రానున్నరోజుల్లో భారీ ఎత్తునే మార్పులు చేర్పులు జరిగే అవకాశం వున్నదని అంటున్నారు. రాష్ట్రానికి చెందిన సీనియర్‌ మంత్రి విద్యాసాగర్‌రావు ఆయనతో పాటు కృష్ణంరాజు ఉద్వాసనకు గురికావడం తథ్యం అని బలంగా వినిపిస్తున్నది. అయితే వెంకయ్య ఆశీస్సులు పుష్కలంగా వున్న కృష్ణంరాజు ఏదోవిధంగా వేటుతప్పించుకునే అవకాశం వున్నదని విద్యాసాగర్‌రావు బలికావడం మాత్రం తథ్యమని అంటున్నారు. పెట్రోల్‌ స్కామ్‌ బయటపడిన తర్వాత విద్యాసాగర్‌రావు సొంతపార్టీవారే తనను అప్రదిష్టపాలు చేస్తున్నట్టుగా చేసిన వ్యాఖ్యతో ఆయన పరిస్థితి మరింత దారుణంగా తయారయింది.

వెంకయ్య వర్గాన్ని ఉద్దేశించేవిద్యాసాగర్‌రావు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా భావిస్తున్న అధిష్టాన వర్గం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో వుంది. డిప్యూటీ ప్రధాని అద్వానీ గురువారం నాడేవిద్యాసాగర్‌రావును పిలిపించుకుని తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. రాష్ట్ర బిజెపిలో వెంకయ్యనాయుడు తన వర్గాన్ని సంఘటితం చేసుకునే సన్నాహాల్లో భాగంగా తనకంటేసీనియర్లు, తన కనుసన్నల్లో పనిచేయడానికి ఇచ్చగించనివారిని దూరం నెట్టే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగానే వేణుగోపాల్‌రెడ్డిని చెన్నైకిపంపారు. మరో సీనియర్‌ నేత రామారావును విజయవంతంగా పక్కకు నెట్టారు. పాతతరం నేతలకు సన్నిహితుడైనవిద్యాసాగర్‌రావుకు కూడా వెంకయ్యతో సంబంధాలు అంతంతమాత్రంగానే వున్నాయి.అందువల్ల దొరికిన ఈ ఛాన్స్‌ను ఉపయోగించుకునివిద్యాసాగర్‌రావుకు ఉద్వాసన చెప్పించేందుకు వెంకయ్యవర్గం భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నదనిఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X