వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుపాతరకు ఏడుగురి బలి

By Staff
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌ః ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా సరిహద్దుల్లో వున్న రాయగఢ జిల్లాల్లో ఆదివారం ఉదయం నక్సల్స్‌ పేల్చిన మందుపాతరకు ఏడుగురు పోలీసు సిబ్బంది బలయ్యారు.

జిల్లాలోని గరతపడార్‌ గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది. సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని నకల్స్‌ మందుపాతరతోపేల్చివేయడంతో ఆరుగురు పోలీసులు, వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించారు. కాగా ఈ సంఘటనలో గాయపడిన మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. గ్రామంలో ఇన్‌ఫార్మర్‌ అనే ఆరోపణతో ఒక వ్యక్తిని నక్సల్స్‌ కాల్చిచంపారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు బృందాలు గాలింపు చేపట్టాయి. గాలింపు చేపట్టిన పోలీసులనే నక్సల్స్‌ టార్గెట్‌ చేసినట్టుగా అధికారులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X