వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ లుకలుకలు దేశం కుట్ర

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః కాంగ్రెస్‌ అగ్రనేతలు పిసిసి అధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు, సిఎల్‌పి నేత వైఎస్‌ మధ్య విభేదాలు తొలిగాయి. పత్రికల్లో వార్తలను బట్టి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంతా భావిస్తున్న ఈ ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకుని ఒక గంటసేపు హోటల్‌ గదిలో ఏకాంతంగా ముచ్చటించుకున్నారు.

తమ మధ్య విబేధాలు తెలుగుదేశం పార్టీ కొన్ని పత్రికల కుట్ర అని వారుపేర్కొన్నారు. కాంగ్రెస్‌ బలపడుతుండటంతో భయపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిగట్టుకుని ఒక పత్రికలో వైఎస్‌కు తనకు మధ్య విబేధాలు వున్నట్టుగా రాయిస్తున్నారని ఎంఎస్‌ఆర్‌ ఆరోపించారు. కాగా రాజ్యసభ కోసం ప్రయత్నించివిఫలుడైన మరో పత్రికాధిపతి కూడా తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నట్టుగా వైఎస్‌ తెలిపారు. అనంతపురంలో ఒకపెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన ఈ ఇద్దరు నాయకులు ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఎంఎస్‌కు వ్యతిరేకంగా తాను అధిష్టాన వర్గానికి ఒక్క మాట కూడా చెప్పలేదని వైఎస్‌ స్పష్టం చేయగా ఢిల్లీకి వైఎస్‌కు వ్యతిరేకంగాడెలిగేషన్‌ పంపిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు అబద్దమని ఎంఎస్‌ఆర్‌ వెల్లడించారు. ఈ ఇద్దరు నేతలు పరస్పర అనురాగంతో హాయిగా కలిసిపోవడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా సంతోషంగా కనిపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X