వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసి నిర్ణయంపై ఉత్కంఠ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గుజరాత్‌లో రెండు రోజుల పాటు పర్యటించిన ఎన్నికల కమిషనర్ల బృందం తీసుకునే నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది. కమిషనర్ల బృందం ఆదివారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లింగ్డో చెప్పారు.

లింగ్డో సారథ్యంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు గుజరాత్‌లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పరిస్థితినిస్వయంగా చూస్తూ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఎన్‌డిఎ నేతలు ముఖ్యంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బృందం తీవ్ర కలవరంతో వుంది. బరోడాలో అధికార యంత్రాంగంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లింగ్డో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలుదాచిపెట్టి ఎందుకు కథలు చెబుతారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ను ఒక సందర్భంలో చెడామడా దులిపేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు కమిషన్‌ తిరస్కరించే అవకాశం వున్నదనే అభిప్రాయంవినవస్తున్నది. అయితే ఎన్నికల నిర్వహణ కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల యిష్టంపై ఆధారపడివుంటుందని ఈవిషయంలో మరెవ్వరికీ ప్రమేయం వుండదని అద్వానీ ప్రకటించారు. దీనివల్ల గుజరాత్‌ ఎన్నికల వ్యవహారంపై కేంద్రం ఎన్నికల కమిషన్‌ మధ్య రగడ తథ్యమనిఅంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X