వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాలపై వెంకయ్య ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయిః పెట్రోల్‌ బంకుల స్కామ్‌పై ప్రతిపక్ష పార్టీలు గతవారం అంతా పార్లమెంట్‌ను స్తంభింపజేయడాన్ని బిజెపి అగ్రనేత వెంకయ్యనాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. గతంలో కూడా అయోధ్య, పోటాపై ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను నడువకుండా చేశాయని ఆయన విమర్శించారు.

పెట్రోల్‌ స్కామ్‌పై సభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చర్చను అడ్డుకోవడం ద్వారా దేశ ప్రయోజనాలకు చెరుపు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. అమూల్యమైన కాలం వృధాఅయిపోతున్నదని సభలో చర్చించాల్సిన ముఖ్యమైన ప్రజాసమస్యలు అలాగే వుండిపోయాయని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X