వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోల్కొండ పి.ఎస్‌. ఎదుట ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చారిత్రాత్మక గోల్కొండ సమీపంలో ఒక బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన పెనువివాదానికి దారితీసింది. ఆ బాలుడ్ని ఎవరో హత్య చేశారని, అయితే పోలీసులు దానిని ప్రమాద సంఘటనగా చిత్రీకరించి కేసు మూసేశారని ఆరోపిస్తూ బాలుని బంధువులు పోలీస్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో శనివారం రాత్రి గోల్కొండ పోలీస్టేషన్‌ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

నెలరోజుల కిందట ఇదే ప్రాంతంలో ఒక బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడని, ఈ వరస సంఘటనలు హత్యలే అని స్థానికులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే శనివారం జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనని, ఇది హత్య కాదని పోలీసులు చెబుతున్నారు. బాలుడు చెరువులో దిగి ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే బాలుడి వంటిమీదదెబ్బలు వున్నాయి కాబట్టి ఇది హత్యే అని స్థానికులుఅంటున్నారు. మజ్లిస్‌ నేతలు రంగప్రవేశం చేయడంతో స్థానికులు పోలీస్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. నగర పోలీస్‌ కమిషనర్‌ కృష్ణారావు రాత్రి పొద్దుపోయాక గోల్కొండ పోలీస్టేషన్‌ కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనపైవిచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X