వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిని ఆశ్రయించనున్న కేంద్రం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గుజరాత్‌ లో ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించరాదంటూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఖంగుతిన్న ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివేదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆహారశాఖ మంత్రి శరద్‌ యాదవ్‌ ఆదివారం ఈవిషయాన్ని వెల్లడించారు. సంచలనాత్మకమైన ఎన్నికల సంఘం నిర్ణయంపై వాజ్‌పేయి సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది. ఎన్నికల సంఘం నిర్ణయంపై సుదీర్ఘంగా చర్చించింది.

ఎన్నికల సంఘం నిర్ణయం కారణంగా గుజరాత్‌ లో రాజ్యాంగసంక్షోభం తలెత్తే ప్రమాదం వున్నదనే అభిప్రాయం వ్యక్తంఅయింది. దీంతో రాజ్యాంగంలోని 143 ఆర్టికల్‌ కింది ఈ వ్యవహారంపై సలహా కోసం రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను ఆశ్రయించాలని నిర్ణయించింది.

గుజరాత్‌ లో సత్వరం ఎన్నికలు జరపాలనే మోడి ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నికల సంఘం శుక్రవారం మోకాలడ్డింది. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఎన్నికలునిర్వహించాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. దీంతో వాజ్‌పేయి ప్రభుత్వం నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. దీంతో ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యాన్నికోరి ఎలాగైన తక్షణం ఎన్నికల జరిపించి లబ్ది పొందాలని బిజెపి భావిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X