రాష్ట్రపతిని ఆశ్రయించనున్న కేంద్రం
న్యూఢిల్లీః గుజరాత్ లో ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించరాదంటూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఖంగుతిన్న ఈ వ్యవహారాన్ని రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివేదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆహారశాఖ మంత్రి శరద్ యాదవ్ ఆదివారం ఈవిషయాన్ని వెల్లడించారు. సంచలనాత్మకమైన ఎన్నికల సంఘం నిర్ణయంపై వాజ్పేయి సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఎన్నికల సంఘం నిర్ణయంపై సుదీర్ఘంగా చర్చించింది.
గుజరాత్ లో సత్వరం ఎన్నికలు జరపాలనే మోడి ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నికల సంఘం శుక్రవారం మోకాలడ్డింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలునిర్వహించాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. దీంతో వాజ్పేయి ప్రభుత్వం నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. దీంతో ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యాన్నికోరి ఎలాగైన తక్షణం ఎన్నికల జరిపించి లబ్ది పొందాలని బిజెపి భావిస్తున్నది.