వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేనేతకు కొత్తఊపు, రూపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ చేనేత రంగానికి కొత్త రూపం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 335 చేనేత సహకార సంఘ సభ్యులకు ఆధునిక డిజైనింగ్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పడాల భూమన్న వెల్లడించారు. ఆదివారం ఆయన చేనేత కుసుమాలుపేరిట చేనేతవస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ సహకారంతో చేనేత సహకార సంఘ సభ్యులకు ఆధునిక వస్త్రాల తయారీ, మార్కెటింగ్‌ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలు మార్కెట్‌ లో ప్రవేశించడంతో సంప్రదాయ చేనేత పరిశ్రమ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఆధునిక పోకడలకు అనుగుణంగా చేనేత రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నదన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని గుండ్లపోచారంలో ఏర్పాటు చేసిన విధంగానేవిశాఖపట్నంలో కూడా త్వరలో 27 కోట్ల రూపాయల వ్యయంతోఅప్పెరల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మరో 15అప్పెరల్‌ పార్కులు, 15 టెక్స్‌ టైల్‌ పార్కులు ఏర్పాటు చేయడంతో ద్వారా చేనేత రంగాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే చర్యలలో భాగంగా ఈ నెల 23న హైదరబాద్‌ లో గార్మెంట్‌ఎక్స్‌ పోను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X