వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యామ్నాయ జట్టు ఎంపిక

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: శ్రీలంకలో జరిగే ఐసిసి టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ)సెలెక్షన్‌ కమిటీ 25 మంది ప్రొబబుల్స్‌ను ఎంపిక చేసింది. ఈ ప్రొబబుల్స్‌ జాబితాను ప్రకటించడానికి బిసిసిఐ నిరాకరించింది.

ఈ జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌,వీరంద్ర షెహవాగ్‌ లేరనే ప్రచారం జరుగుతోంది. తమ మనసు మార్చుకోవడానికి బిసిసిఐ ఇంగ్లాండు పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లకు బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చింది. అయితే, భారత ఆటగాళ్లు కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి నిరాకరించడంతో బిసిసిఐసెలెక్షన్‌ కమిటీ ప్రొబబుల్స్‌ను ఎంపిక చేసింది. భారత ఆటగాళ్లు ఇప్పటికైనా మనసు మార్చుకుంటారనే ఆశాభావాన్ని బిసిసిఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఐసిసి ఛాంపియన్‌ ట్రోఫీకి తుది జట్టును ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

ఇదిలా వుంటే, తమ అధికార లోగోలను మాత్రమే ధరించాలనే కాంట్రాక్టును శ్రీలంకలో వచ్చే నెల జరిగే ఐసిసి ఛాంపియన్‌ ట్రోఫీకి మాత్రమే పరిమితం చేస్తామని ఐసిసి అధికార ప్రతినిధి లండన్‌లో ప్రకటించారు. 2007 వరకు జరిగే ఐసిసి అధికార మ్యాచ్‌లన్నింటికీ ఈ నిబంధనలు వర్తింపజేయాలని ఐసిసి నిర్ణయించింది. అయితే, ప్రస్తుతవివాదాన్ని తొలగించేందుకు ఈ కాంట్రాక్టును వచ్చే ఆరు నెలలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X