వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి నివేదనపై 26నవిచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎన్నికల కమీషన్‌ చేసిన సిఫార్సు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ పంపిన నివేదనపై సుప్రీంకోర్టు ఈ నెల 26వ తేదీన విచారణ ప్రారంభిస్తుంది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిలను నిర్వహించకూడదని ఎన్నికల కమీషన్‌ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మూడుఅంశాల విషయంలో తలెత్తిన సందేహాలనువిశదీకరించాలని కోరుతూ రాష్ట్రపతి నివేదనను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్‌. కృపాల్‌ నేతృత్వంలో ఏర్పాటయిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈవిచారణను చేపడుతుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎల్‌.సి. భాదూ చెప్పారు. అటార్నీ జనరల్‌ సోలి సొరాబ్జీ దేశంలో లేనందున సంబంధిత నివేదన నోటీసును సాలిసిటర్‌ జనరల్‌ హరీష్‌ సాల్వేకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X