వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాకప్‌డెత్‌లపైవిచారణకు బాబు ఆదేశం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేర్‌ లాకప్‌డెత్‌లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిచారణకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారి రామలింగేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు.

కర్నూలులో జనశక్తి నక్సలైట్‌ ఎన్‌. రామచంద్రారెడ్డి అలియాస్‌ రాంబాబు మృతిపై, మెదక్‌ జిల్లా సదాశివపేటలో మట్కా జూదం నడుపుతున్నాడనే ఆరోపణపైఅరెస్టయిన రాచన్న మృతిపై ఈ విచారణ జరుగుతుంది. ఈ రెండు లాకప్‌డెత్‌లపై ముఖ్యమంత్రి మంగళవారం పోలీసుఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ లాకప్‌డెత్‌లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనల్లో నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు.

శనివారంనాడు సాయంత్రం రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రంలోగా ఆయనను రిమాండ్‌కు పంపాల్సి ఉంది. ఆదివారం రాత్రి ఆయన మృతి చెందాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X