వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడగడలాడిస్తున్న గోదావరి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రిః ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడం, నాలుగురోజుల పాటు రాష్ట్రమంతటా వర్షాలు కరిసిన ఫలితంగా గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తున్నది. గోదావరికి వరదలు రావడంతో 23 గ్రామాలు జలమయం అయ్యాయి. లోతట్టు గ్రామాల ప్రజలను అధికారయంత్రాంగంసురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. వరదల్లో ఎనిమిది మంది మరణించారని అనధికార వర్గాల కధనం. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మరణించారని సహాయపునరావాస కమిషనర్‌ రోశయ్య చెప్పారు.

సోమవారం మధ్యాహ్నానికి గోదావరి నీటిమట్టం రెండో ప్రమాద సూచికకు చేరింది. దీంతో అధికారయంత్రాంగం పూర్తిగా అప్రమత్తంఅయింది. వరదనీరు ఇప్పటికే వచ్చేసింది కాబట్టి నీటిమట్టం మరింతపెరగక పోవచ్చునని అధికారులుఅంచనా వేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X