వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గడగడలాడిస్తున్న గోదావరి
రాజమండ్రిః ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడం, నాలుగురోజుల పాటు రాష్ట్రమంతటా వర్షాలు కరిసిన ఫలితంగా గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తున్నది. గోదావరికి వరదలు రావడంతో 23 గ్రామాలు జలమయం అయ్యాయి. లోతట్టు గ్రామాల ప్రజలను అధికారయంత్రాంగంసురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. వరదల్లో ఎనిమిది మంది మరణించారని అనధికార వర్గాల కధనం. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మరణించారని సహాయపునరావాస కమిషనర్ రోశయ్య చెప్పారు.
Comments
Story first published: Tuesday, August 27, 2002, 23:53 [IST]