వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు జవాబుఅక్కర్లేదు: కృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆరోపణకు జవాబు ఇవ్వాల్సిన అవసరంలేదని కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ అన్నారు. గంధం చెక్కల స్మగ్లర్‌వీరప్పన్‌ పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్‌టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌ఛార్జి ఐజి కెంపయ్యను కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేయడం వల్లనే నాగప్ప కిడ్నాప్‌ జరిగిందని జయలలిత అన్నారు. జయలలిత ఆరోపనలకువివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

టేప్‌లో వీరప్పన్‌పెట్టిన డిమాండ్లు ఏవైనా ఉన్నాయా అని విలేకరులు అడిగితే లేవని ఆయన జవాబిచ్చారు.అందులో కొత్త విషయాలు ఏవీ లేవని, ఒక నిమిషం పాటువీరప్పన్‌ మాట్లాడిన మాటలు రికార్డయి ఉన్నాయని, ఇదివరకటి మాటలనే మళ్లీ చెప్పాడని ఆయన అన్నారు.వీరప్పన్‌ను పట్టుకోవడంలో రెండు రాష్ట్రాల మధ్య సహకారం కొరవడిందా అని అడిగితే అది ఎప్పుడూ ఉన్నదేనని,అందుకే ఉమ్మడి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటయిందని ఆయన సమాధానమిచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X