వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్‌ పోలీసులుపరుగోపరుగు!

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌ః మట్కాను ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణపై మెదక్‌ జిల్లా సదాశివపేట పోలీసులు 55 ఏళ్ళ రాచప్పనుఅరెస్టు చేశారు. సోమవారం నాడు రాచప్ప పోలీస్టేషన్‌ ఆవరణలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులో రాచప్పను చిత్రహింసలకు గురిచేసి చంపారని ఆరోపిస్తూ వందలాది మంది ప్రజలు పోలీస్టేషన్‌ పై దాడి చేశారు.

అభంశుభం తెలియని రాచప్పను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ పోలీస్టేషన్‌ పై ప్రజలు విరుచుకుపడ్డారు. ఫర్నిచర్‌ ను, రికార్డులను, ఎస్‌.ఐ. హీరోహోండా మోటర్‌సైకిల్‌ ను దగ్ధం చేశారు. పోలీసులను తరిమితరిమి కొట్టారు. జనాగ్రహానికి భయపడిన పోలీసులు తలాఒకదిక్కుకు పారిపోయారు. సంగారెడ్డి నుంచి అదనపు బలగాలను రప్పించిన తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాచన్న మరణించాడన్న వార్త సదాశివపేటలో దావానలంలా వ్యాపించింది. మగవాళ్లంతా జాతీయరహదారిపై గుమికూడి సమాలోచన చేశారు. రాస్తారోకో ప్రారంభించారు. ఈ పద్ధతి లాభంలేదనుకున్న మహిళలు కొంగులుబిగించి కొందరు మగవాళ్ళను కలుపుకొని పోలీస్టేషన్‌ పై దాడి చేశారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా వున్నదని పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X