వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై వెంకయ్య ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు మంగళవారం తీవ్రంగా ధ్వజమెత్తారు. బిజెపి ప్రతిష్టను దిగజార్చడానికి కాంగ్రెస్‌ హిట్‌ అండ్‌ రన్‌ పద్ధతిని అవలంభిస్తోందని ఆయన దుయ్యబట్టారు.

పార్టీ దక్షిణాది ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. అన్నివిషయాల్లో బిజెపి చేతిలో ఓటమికి గురైన ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు. తమ ఆరోపణల్లో ఎంత వరకు నిజముందో తేల్చాలని ఆయన ప్రతిపక్షాలకు సవాల్‌విసిరారు. బిజెపి నేతృత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం కుంభకోణాలు లేని, ఒత్తిడి లేని పరిపాలననుఅందిస్తోందని ఆయన అన్నారు. తమ బండారం బయటపడుతుందనే భయంతోనేపెట్రోల్‌ పంపుల వ్యవహారంలో ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ విడిగా నాయకలపై, బిజెపి మంత్రులపై ఆరోపణలకు దిగుతోందని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశంలో బిజెపివిజయానికి బెంగుళూర్‌ గేట్‌వే అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X