వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య భూకబ్జా దారుణం: సోనియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దళితులకు చెందాల్సిన భూమిని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు తన పేర పట్టా చేయించుకోవడం దారుణమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ఎస్‌సి, ఎస్‌టి విభాగం సదస్సులో ఆమె శుక్రవారం ప్రసంగించారు.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌సి, ఎస్‌టిలపై దౌర్జన్యాలుపెరిగాయని ఆమె విమర్శించారు. ఎస్‌సి,ఎస్‌టిలపై దౌర్జన్యాలను ఆపడానికి చట్టాలను అమలు చేయడమే కాకుండా వాటి అమలును పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆమె అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న దౌర్జన్యాలకు సంబంధించిన కేసుల్లో తీర్పులు వెలువడడంలో జాప్యం జరుగుతోందని, ఈవిషయంలో తీర్పులు త్వరితగతిని వెలువరించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమం కోసం విస్తృత చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని సోనియా అన్నారు.


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X