వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాన్సరర్లదే భారమంటున్న భారతజట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఐసిసితో జరుగుతున్నవివాదంలో భారత క్రికెటర్లు తమ భారాన్ని స్పాన్సరర్ల నెత్తినపెట్టారు. శ్రీలంకలో జరిగే ఐసిసి టోర్నీ ముగిసిన తరువాత నెలరోజుల వరకు తమ లోగోలు మాత్రమే ధరించాలని ఐసిసి భీష్మించింది. టోర్నీ జరిగే 18 రోజులు మాత్రమే ఐసిసి లోగోలు ధరిస్తామని భారత్‌ జట్టు పట్టిపడుతున్నది. టోర్నీలో పాల్గొనే 12 జట్లలో భారత్‌మినహా మిగిలిన అన్ని జట్లు సంతకాలు చేశాయి.

భారత్‌ జట్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది. ఈక్లిష్టపరిస్థితుల్లో తమస్పాన్సరర్లే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆటుగాళ్ళుకోరారు. 48 గంటల్లో భారత క్రికెటర్లు ఒక నిర్ణయం తీసుకుంటారని గంగూలీ బృందం ప్రతినిధి తెలిపారు. 40 రోజుల కోసం చూసుకుంటే గంగూలీ బృందాన్ని కాకుండా బిసిసిఐ వేరే బృందాన్ని నాకౌట్‌ టోర్నమెంట్‌ కు పంపితే మొదటికే మోసం వస్తుంది కాబట్టి స్పాన్సరర్లు పాక్షింకంగా నష్టాన్ని భరించేందుకే సిద్ధపడతారని భావిస్తున్నారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందంగా బిసిసిఐ చప్పుడు కాకుండా సంతకాలు చేసి ఇప్పడు ఆటగాళ్ళ పై భారంఅంతా నెట్టేసి మౌనం వహించడం విడ్డూరం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X